Saturday, 22 March 2014

లండన్ హైకూలు

హైకూ


హైకూ జపనీస్ సాహిత్యంలో విశేష ఆదరణ పొందిన  కవిత్వ ప్రక్రియ. ఇది 15వ శతాబ్దం నుండి వెలుగులోకి వచ్చింది.
ఇంత పురాతన చరిత్ర కలిగా ఉన్నా, సంక్షిప్తంగా ఉండటం వలన ఆధునిక పాఠకులకు కూడా చేరువ అయ్యింది.
మనం ఇప్పుడు ఒకసారి  హైకు నిర్మాణం గురించి, కొన్ని ఉదాహరణలు చూద్దాము.

హైకు నిర్మాణం చాలా తేలికగా ఉంటుంది.
1.
హైకూ మూడు పాదాలలో పదిహేడు 'మాత్రలు '( సిలబుల్స్) కలిగిన త్రిపద.
2.
మొదటి పాదంలో ఐదు, రెండో పాదంలో ఏడు, మూడో పాదంలో ఐదు చొప్పున మాత్రలు ఉంటాయి.
3.
రెండు వేరువేరు విషయాలు విశ్లేషించబడతాయి.
4.
ఒక ఋతువుకి  సంబంధించిన పదం  ఉంటుంది

అదృష్టవశాత్తు ఇస్మాయిల్  గారు ఈ ప్రక్రియ ని తెలుగుకి పరిచయం చేశారు.
ప్రముఖ సాహితీ కారులు  వాడ్రేవు చినవీరభద్రుడు మాటలలో చెప్పాలంటే  "మానవాత్మనీ, భూమ్యాకాశాల్ని, వెలుగు నీడలను ఒకే స్నాప్ షాట్ లో పట్టే ప్రక్రియ".

మొదట్లో  పైన చెప్పబడిన  నియమాలు అనుసరించెను,  రానురాను తెలుగులో ఆ కూర్పు పాటించట లేదు.

ఉదాహరణ (సంప్రదాయ హైకు ):

సమీక్షకుడు
పచ్చి పాల మీగడ
వెతికే అత్త
-
పెన్నా శివరామకృష్ణ

ఉదాహరణ (ఆధునిక హైకు ):

వాగు ప్రవాహానికి
అన్నీ కొట్టుకుపోతున్నాయి
చంద్రుడు తప్పించి
-
తలతోటి పృథ్విరాజ్


ఈ తరహాలో  లండన్ (UK)  నేపథ్యంలో కొన్ని స్వీయ హైకులు.



 
నల్ల మబ్బులు
 
లండన్ మూల మూలాల్లో 
 
పొమ్మంటున్నాయి .

రంగు రంగుల్లో
మధ్య జేగురు రంగు
కలల వర్షం.

 
వీపింగ్ విల్లో
ప్రొద్దు అందాలరాశి
రాత్రి  దెయ్యాల మర్రి .

హంతకులకి
స్వర్గం ఎవడు ఇస్తాడో!
చెప్పింది ఎవరో?





Tuesday, 18 March 2014

విలోమ కావ్యాలు

  మనలో చాలామందికి  PALINDROME అంటే తెలుసు.కాని కొన్ని కావ్యాలు సంపూర్ణంగా ఈ తరహాలో ఉన్నాయ్ అంటే ఆశర్యం కలగక మానదు. అందులోన ఈ ప్రక్రియ మన సంస్కృతంలో ఆవిర్భవించింది అంటే గర్వ పడక తప్పదు. ఇంత వరుకు మరే ఇతర భాషలో ఈ రకమైన పుస్తకాలు ఉన్నట్లు కనపడదు.

                        క్రీ శ  14 శతాబ్దంలో  శ్రీ  సుర్యదాస అనే పండితుడు  అహ్మదనగర్  సామ్రాజ్యం లో,  పార్తాపూర్ అనే ఊరిలో ఉండేవాడు.  ఆయన రచించిన 'రామకృష్ణ విలోమ కావ్యం' లో  40 పద్యాలు ఉన్నాయి. వాటి విశేషం ఏమిటంటే ముందు నుండి చదివితే రామాయణం, చివరనుండి ముందుకు చదివేతే భారతం గోచరిస్తాయి.
కుడి నుండి  ఎడంకి  చదివే భాషలు అరబిక్,పర్శియను బహుశా ఆ కాలంలో  ఈ కవి ని ప్రభావితం  చేసి ఉండవచ్చునని చరిత్ర కారుల అభిప్రాయం. ఈ వ్యాసం చివరలో ఒక  పద్యాన్ని విశ్లేషిద్దాం.
       
                      ఇదే విధంగా శ్రీ వెంకట కవి  క్రీ శ  1650 ప్రాంతంలో 'శ్రీ రాఘవ యాదవీయం' అనీ పుస్తకాన్ని విరచించారు. మన అదృష్టం  ఏమిటంటే ఈ కావ్యాలు రెండు మనకు లభ్యం అవడం. ఇవి కాకుండా  చిదంబర కవి రచించిన 'శబ్దచిoతామణి ' , రచయిత  ఎవరో  తెలియని 'నల హరిచంద్రియ' ఈ కోవలో కి వచ్చే  అద్బుత కావ్యాలు.
ఇంతకు పూర్వమే ఈ విధమైన ప్రయోగాలు 'కిరాతర్జునియం', 'శిశుపాలవధ' లాంటి ప్రభంధములలో  ఉన్నా అవి ఒక పద్యానికి లేదా ఒక శ్లోకానికి  పరిమితం అయినవి. అందుచేత శ్రీ సూర్యదాస కవిని విలోమ కావ్య పితామహుడు  అనవచ్చు.


 ఒక పద్యాన్ని చూద్దాం :

 తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీ:

ఈ పాదాలని తిప్పి వ్రాస్తే ...

శ్రీయాదవం భవ్యభతోయదేవం
సంహారదాముక్తిముతాసుభూతం


మొదటి  పద్యం  సీతా దేవిని స్తుతిస్తే , రెండవ పద్యం కృష్ణ భగవానుడి గీత భోదని వర్ణిస్తుంది.

 మన తెలుగుకి అత్యంత దగ్గరిగా ఉండే సంస్కృత భాష ఎంత గొప్పదో కదా !
 



Friday, 14 March 2014

చిన్న మాట

నవ్య తారలే సుదూర స్వప్న గీతికలయై
వీనులవిందు సేయగా కావ్య కన్నెవై
నడిచి రావే, కరగని ఈ చీకటి
రేయిని కడలిలో కలిపే కమనీయ
ఖజరహో అందంలా కదిలి రావే!